
- 20 ప్రశ్నలపై చర్చకు ఆమోదం!
- పదవీ కాలం 7నెలలే ఉండడంతో అభివృద్ధిపై చర్చకు డిమాండ్ చేసే చాన్స్
- మాన్సున్ ఏర్పాట్లు, శానిటేషన్ పై నిలదీతకు సిద్ధమైన ప్రతిపక్షాలు
- కౌన్సిల్ ముందుకు సీఆర్ఎంపీ సెకండ్ ఫేజ్ ప్రతిపాదనలు
హైదరాబాద్ సిటీ, వెలుగు:జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం బుధవారం బల్దియా హెడ్ ఆఫీసులోని కౌన్సిల్ హాల్ లో జరగనున్నది. ఉదయం10:30 గంటలకు ప్రారంభం కానుండగా.. ఈసారైనా ప్రజా సమస్యలపై చర్చిస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సభ్యుల నుంచి ఇప్పటికే 120 ప్రశ్నలు రాగా, 20 ప్రశ్నలపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే, ప్రతి కౌన్సిల్మీటింగులో ప్రజా సమస్యలపై పెద్దగా చర్చించింది లేదు.
సభ్యుల నుంచి వచ్చిన ఏ ఒక్క ప్రశ్నపైనా సుదీర్ఘంగా చర్చించిన దాఖలాలు లేవు. సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసేలా అధికారులు జవాబులు ఇవ్వడం లేదంటున్నారు. మేయర్.. సభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని పలువురు సభ్యులు ఆరోపిస్తున్నారు. వారికి అనుకూలంగా ఉన్న ప్రశ్నలపై మాత్రమే చర్చించకుండా.. ప్రతి సభ్యుడు అడిగిన ముఖ్యమైన ప్రశ్నలపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు.
అద్దె వాహనాల టెండర్లే హాట్ టాపిక్
కాంగ్రెస్, ఎంఐఎం పొత్తుతో స్టాండింగ్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత జరుగుతున్న కౌన్సిల్ సమావేశం కావడంతో ఈ మీటింగ్కు ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవల జీహెచ్ఎంసీలో జరిగిన అద్దె వాహనాల టెండర్ల వ్యవహారం, రద్దు అంశాలు ప్రధానంగా చర్యకు వచ్చే అవకాశం ఉంది. కౌన్సిల్ పదవీకాలం మరో ఏడు నెలలు మాత్రమే ఉండడంతో ఇదివరకు చేసిన పనులపై కూడా ప్రతిపక్ష పార్టీల సభ్యులు చర్చకు డిమాండ్ చేసే చాన్స్ఉందంటున్నారు.
ప్రధానంగా మాన్సూన్ ఏర్పాట్లు, శానిటేషన్ పై అధికారులను కార్పొరేటర్లు నిలదీయనున్నారని సమాచారం. అలాగే, సీఆర్ఎంపీ సెకండ్ ఫేజ్ కింద 1,142.54 కిలోమీటర్ల రోడ్లను రూ.3,825 కోట్లతో ఏజెన్సీలకు అప్పగించే ప్రతిపాదనలు కౌన్సిల్ ముందుకు రానున్నాయి.